ద్రవిడ్- రోహిత్..గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
43

టీ20 ప్రపంచకప్ లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్​గా కోహ్లీ, కోచ్​గా రవిశాస్త్రి కాంబినేషన్​లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్​గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కెప్టెన్​గా రోహిత్, కోచ్​గా ద్రవిడ్ ఈ ఫార్మాట్​లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్​ టైటిల్​ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని” వెల్లడించాడు గంభీర్.

ఈ ప్రపంచకప్ లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్​ ఇటు కోచ్​గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.