గంగూలీ- కోహ్లీ వివాదం..విరాట్ కు షోకాజ్​ నోటీసులు?

0
48

కోహ్లీ-బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వీరిద్దరి వివాదం గురించి మరో విషయం బయటకు వచ్చింది. కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు దాదా షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు.

గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఆ సమయంలో విరాట్​తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ తెలిపాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు.

విరాట్​ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు గంగూలీకి కోపం తెప్పించాయని, దీంతో అతడికి షోకాజ్​ నోటీసులు పంపించాలని అనుకున్నట్లు సదరు ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయమై దాదా.. బీసీసీఐ సభ్యులతో కూడా చర్చించాడని చెప్పారు. అయితే బోర్డు సభ్యులందరూ కలిసి.. ఈ వివాదం పెద్దది చేయొద్దని సూచించడం వల్ల దాదా తన ఆలోచనను విరమించుకున్నాడని పేర్కొన్నారు.