క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమతి!

Good news for cricket lovers..Spectation allowed for IPL matches!

0
57

ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వరి 12, 13వ‌ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా కారణంగా మ్యాచ్‌ లు ఇండియాలోనే జరుగుతాయా.. ఏక ఒక వేళ జరిగితే.. స్టేడియాల్లోకి ప్రేక్షకును అనుమతి ఇస్తారా అనుమతి ఇస్తే ఎంత మందికి అనుమతి ఇస్తారు ఇలా చాలా ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. అయితే.. దీనిపై బీసీసీఐ వర్గాల నుంచి ఓ క్లారిటీ వస్తోంది.

ఈ సారి ఐపీఎల్‌ మ్యాచ్‌ కు ప్రేక్షకులను కూడా అనుమతించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం అందుతోంది. అయితే ఇది లీగ్‌ జరిగే సమయంలో ఆయా వేదికలు ఉండే రాష్ట్రాల్లో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యను బట్టి ఎంత మందిని అనుమతించాలనే విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందట.

ప్రస్తుతం మాదిరిగానే.. కరోనా కేసులు తగ్గితే.. మ్యాచ్‌ లకు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించే ఆలోచనణలో బీసీసీఐ ఉందని టాక్‌. లీగ్‌ సమయంలో కరోనా కేసులు భారీగా తగ్గితే.. ఆ సంఖ్య మరింత పెరుగనుంది. ఒక వేళ తగ్గకుండా పెరిగితే.. ప్రేక్షకులను అనుమతించకుండా ఉండే అవకాశం ఉంది.