ఐపీఎల్​ వేలంకు లైన్​ క్లియర్..ఆతిధ్యం ఇవ్వనున్న హైదరాబాద్!

Hyderabad to host IPL auction clear

0
51

ఐపీఎల్ మెగా వేలం త్వరలో జరగనుంది. రాబోయే సీజన్​కు సంబంధించిన ఆటగాళ్ల కొనుగోలు ఫిబ్రవరి తొలివారంలో జరగనున్నట్లు సమాచారం తెలుస్తుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లేదా బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది.​

ఐపీఎల్​లో ఆయా ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త టీమ్​లు లక్నో, అహ్మదాబాద్​లు కూడా ముగ్గురు చొప్పున ఆటగాళ్లను తమ జట్టులోకి ఎంపిక చేసుకోనున్నాయి. ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మెగా వేలం ఎప్పుడో జరగాల్సింది కానీ అహ్మదాబాద్​ ఫ్రాంచైజీపై బీసీసీఐ విచారణ కారణంగా ఆలస్యమైంది.

అహ్మదాబాద్​ ఫ్రాంచైజీని బ్రిటీష్​ ప్రైవేట్ ఈక్విటీ సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్​ రూ.5625 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి క్లీన్​చిట్​ వస్తే.. బీసీసీఐ లెటర్​ ఆఫ్ ఇంటెంట్​ను ఫ్రాంచైజీకి ఇస్తుంది. ఇది క్లియర్ అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కూడా ప్లేయర్స్​ను సెలెక్ట్ చేసుకుంటుంది.