ఇండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్..అభిమానులకు నిరాశ..!

India-South Africa Test series .. fans disappointed ..!

0
47

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో తలపడేందుకు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా..ఈ సిరీస్​ నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య జరగబోయే తొలి, రెండో టెస్టును ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసమే టికెట్లు కూడా అమ్మకానికి పెట్టలేదని సమాచారం. కాగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది.

ప్రస్తుతానికైతే వచ్చే ఏడాది జనవరి 03 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సంబంధించిన టికెట్లను విక్రయించడం లేదు. ‘దయచేసి గమనించండి. రెండో టెస్టుకు సంబంధించి టికెట్ల విక్రయాలపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తారా?, లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తాం” అని దక్షిణాఫ్రికా క్రికెట్‌ వర్గాలు తెలిపాయి.