ఐపీఎల్ లో నేడు ఇంటెస్టింగ్ ఫైట్..ఎక్కడ జరగనుందో తెలుసా?

0
43

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 32 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 33 మ్యాచ్ లో తలపడానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ సీసన్ లో రెండు జట్లు అనుకున్న మేరకు రాణించలేదు. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి.