ఆసక్తికరంగా చివరి టెస్టు..కోహ్లీ రాకపై ​హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ

0
38

కేప్‌టౌన్‌ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. చెరో విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఇరు జట్లు..నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జనవరి 11 నుంచి 15 వరకు ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జరగనుంది.

టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్​ కోహ్లీ..దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు సంసిద్ధమవుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ.. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్​లో చురుగ్గా ఉన్న ఫొటోని బీసీసీఐ ట్విట్టర్​లో షేర్ చేసింది. కేప్​టౌన్ చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లు, హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్ ఆధ్వర్యంలో నెట్​ ప్రాక్టీస్​లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు కూడా షేర్​ చేసింది బీసీసీఐ.

మూడో టెస్టు నేపథ్యంలో టీమ్​ఇండియా ప్రాక్టీస్​ ప్రారంభించింది. కేప్​టౌన్​లో ఆటగాళ్లంతా సిరీస్​ నెగ్గాలనే ధీమాతో కసరత్తులు చేస్తున్నారు.” అని బీసీసీఐ షేర్​ చేసిన ఫొటోలకు కాప్షన్ జోడించింది. విరాట్​ కోహ్లీ మూడో టెస్టులో అందుబాటులోకి వస్తే.. హనుమ విహారికి విశ్రాంతి లభించనుంది. అయితే.. రెండో టెస్టు తర్వాత విరాట్​ రాకపై క్లారిటీ ఇచ్చాడు హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్. కోహ్లీ కోలుకుంటున్నాడని చివరి టెస్టులో తప్పకుండా ఆడుతాడని ధీమా వ్యక్తం చేశాడు.