ఐపీఎల్ 2022: ఆ రెండు కొత్త జట్లు ఇవే..?

IPL 2022: Are these the two new teams?

0
69

ఐపీఎల్ లీగ్​లో మరో రెండు కొత్త జట్లు రానున్నాయి. వాటి వేలాన్ని అక్టోబరు 25న నిర్వహించనుంది బీసీసీఐ. కొత్త టీమ్​లకు యజమానులు కావడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జట్లను దక్కించుకునేందుకు అహ్మదాబాద్​, లక్నోలు ముందు వరుసలో ఉన్నాయని సమాచారం.

అహ్మదాబాద్​ నుంచి అదానీ గ్రూప్ బిడ్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో సంస్థ మాంచెస్టర్ యూనైటెడ్​ ప్రీమియర్ లీగ్ లక్నో తరపున బిడ్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జట్ల మొదటి ధరను రూ.2000 కోట్లుగా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అన్నీ పార్టీలు వేలం జరగనున్న దుబాయ్​కి ఇప్పటికే చేరుకున్నాయి.

యూరప్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, ఒడిశాకు చెందిన పవర్, స్టీల్, కోల్​ తయారీ సంస్థ, కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్(సీవీసీ), అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఐపీఎల్ కొత్త జట్లపై కన్నేశాయని తెలుస్తోంది. సీవీసీ ఇప్పటికే ఫార్ములావన్​ను సొంతం చేసుకుంది.