అయ్యో ఏం కష్టమొచ్చిందో..పిల్లలకు ఉరి వేసి ఆపై తల్లి కూడా..

0
47

దేశంలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మార్కులు రాలేదని, లవ్ ఫెయిల్ అయిందని, ఆరోగ్యం బాగాలేదని, ఉద్యోగం రాలేదని ఇలా ఇతరత్ర కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి చిన్నారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మొదట పిల్లలకు ఉరి వేసి చంపి ఆపై తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి ధనలక్ష్మి, పిల్లలు సమన్విత, శంకరమ్మగా పోలీసులు గుర్తించారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.