పాకిస్థాన్ క్రికెటర్ అరుదైన ఫీట్..పొట్టి ఫార్మాట్ లో తిరుగులేని రిజ్వాన్

Pakistan cricketer's rare feat .. Rizwan's unstoppable in short format

0
48

పాకిస్థాన్ ఓపెనర్​ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​ అరుదైన ఘనత​ సాధించాడు. వెస్టిండీస్​తో చివరి టీ20 మ్యాచ్​లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్​ ఇయర్​లో 2000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్​గా నిలిచాడు.

వెస్టిండీస్​తో టీ20 సిరీస్​లో భాగంగా ఈ ఘనత సాధించాడు రిజ్వాన్. కరాచీ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్​ 11వ ఓవల్లో రిజ్వాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్, వెస్టిండీస్​ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.

ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం మూడు మ్యాచ్​ల టీ20 సీరీస్​ పూర్తయిన తర్వాత ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఈ మేరకు ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్​లో మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించాయి.