రోహిత్, రాహుల్, పంత్ కాదు..కెప్టెన్ గా కొత్త పేరు తెరపైకి..

Rohit, Rahul, not Pant .. new name on the screen as captain ..

0
36

టీ20 ప్రపంచకప్​ అనంతరం టీమ్​ఇండియా టీ20 సారథిగా విరాట్​ కోహ్లీ తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్​ ఎవరనే దానిపై చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్​ఇండియా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

చాలా మంది దిగ్గజాలు కేఎల్ రాహుల్, రోహిత్​ పేర్లు చెబుతున్నారు. మరికొంత మంది పంత్​కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ పేసర్ అశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఓ పేసర్​కు సారథి అయ్యే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాను జట్టుకు కెప్టెన్​ చేయాలని సూచించాడు.

మరో వారం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీ20 జట్టుకు కొత్త కెప్టెన్​ ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే న్యూజిలాండ్​తో 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో నెహ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.