కోహ్లీ అభిమానులకు షాక్..!

Shock to Kohli fans ..!

0
49

టీం ఇండియా టీ20 కెప్టెన్‎గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‎గా కేఎల్ రాహుల్‎ను నియమించారు. న్యూజిలాండ్‎తో జరిగే సిరీస్‎కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్​కు కోహ్లీ దూరమయ్యాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత కోహ్లీ ఆటగాడిగా కొనసాగుతానని చెప్పాడు. కానీ కోహ్లీ పేరు బీసీసీఐ ప్రకటించిన జట్టులో లేకపోవడం షాక్ కు గురి చేసింది. దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రావిడ్​ హెడ్​కోచ్​గా టీమ్​ఇండియాకు తొలి సిరీస్​ ఇదే కావడం విశేషం.

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.