బ్రేకింగ్- క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం

Spot-fixing in cricket

0
34

దేశవాళీ క్రికెట్​లో స్పాట్ ఫిక్సింగ్​ కలకలం రేపింది. తమిళనాడు ప్రీమియర్​ లీగ్ త్వరలో జరగనున్న​ నేపథ్యంలో క్రికెటర్​ సతీష్​ రాజగోపాల్​ను​ ఫిక్సింగ్​కు పాల్పడాలంటూ ఓ వ్యక్తి డబ్బు ఆఫర్​ చేసినట్లు తెలిసింది.

“జనవరి 3న బన్నీ ఆనంద్ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతా నుంచి సతీష్ రాజగోపాల్​కు కొంత డబ్బు ఆఫర్​ చేశాడు. స్పాట్ ఫిక్సింగ్​కు పాల్పడాలని కోరాడు. తమిళనాడు ప్రీమియర్​ లీగ్​ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్​కు చెప్పాడు. ఒక్కో మ్యాచ్​కు రూ. 40 లక్షలు ఇస్తామని సతీష్​కు ఆఫర్​ ప్రకటించాడు” అని లోకేష్​ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఈ ఆఫర్​ను తిరస్కరించిన సతీష్​ కూడా.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశాడు.