క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్..ఇక థియేటర్లలో​ మ్యాచ్​లు

T20 World Cup matches can be seen in theaters!

0
42

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో భారత్ ఆడే మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్ ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్​ లిమిటెడ్ సీఈఓ గౌతమ్​ దత్తా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, పూణె, అహ్మదాబాద్​ సహా దేశంలోని 35 నగరాల్లో 75కు పైగా పీవీఆర్​ స్క్రీన్లలో టీమ్ఇండియా మ్యాచ్​లను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచకప్​ మ్యాచ్​లను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పీవీఆర్​ సీఈఓ గౌతమ్​ దత్తా అన్నారు. సినిమా, క్రికెట్​ రెండూ ఎంతో వినోదాన్ని అందిస్తాయన్న గౌతం దత్తా మ్యాచ్​ను తెరపై చూస్తున్నప్పుడు స్టేడియంలో వీక్షించిన అనుభూతి..అభిమానులకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో భారత్​ తలపడనుండగా థియేటర్లలో వీక్షించే వారికి ఈ మ్యాచ్​ మరింత వినోదాన్ని పంచనుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.