టీమ్​ఇండియా, వెస్టిండీస్​ సిరీస్..వేదికలపై త్వరలో బీసీసీఐ క్లారిటీ!

Team India, West Indies series..BCCI Clarity coming soon on the stage!

0
37

టీమ్​ఇండియా, వెస్టిండీస్​ మధ్య ఫిబ్రవరి 6 నుంచి సిరీస్​ ప్రారంభంకానుంది. తొలుత వన్డేలు.. అహ్మదాబాద్, జైపుర్, కోల్​కతాలో.. టీ20లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో నిర్వహించాలని బీసీసీఐ యోచించింది. అయితే ఈ  సిరీస్​ రెండు వేదికల్లోనే నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. దేశంలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా బీసీసీఐ టూర్స్, టెక్నికల్ కమిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే.. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. “బీసీసీఐ టూర్స్, ఫిక్చర్స్ అండ్ టెక్నికల్ కమిటీ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్​ పరిస్థితుల దృష్ట్యా.. వెస్టిండీస్​తో సిరీస్​ ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్​లు రెండు మైదానాల్లోనే నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

కోల్​కతా, అహ్మదాబాద్​ను వేదికలుగా ప్రకటించారు.” అని క్రికెట్​ వర్గాలు పేర్కొన్నాయి. మూడు వన్డేలను ఒక వేదికగా, మూడు టీ20లను మరో వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ సభ్యులు బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.