స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌లోకి ఆ ఇద్దరు..వార్నర్ కూడా!

Those two Sunrise risers into Hyderabad..warner too!

0
42

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి రెడీ అని ప్రకటించారు. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఈ వేలంలో మొత్తం క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (61 మంది), క్యాప్​డ్ ఇంటర్నేషనల్ (209 మంది), అసోసియేట్ (41 మంది), ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (143 మంది), గత సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (6 మంది), అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (692 మంది), అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (62) మంది తమ పేర్లను మెగావేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు అయిన మార్టిన్ గుప్తిల్, ట్రెంట్ బౌల్ట్ ఈసారి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడబోతున్నారని సమాచారం. ఇందుకోసం టీం మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. ఇక అటు డేవిడ్ వార్నర్ మరోసారి హైదరాబాద్ జట్టులోనే ఆడతారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.