కోహ్లీ సంచలన నిర్ణయంపై గంగూలీ ఏమన్నాడంటే?

What did Ganguly say about Kohli's sensational decision?

0
42

టీమ్​ఇండియా టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్​ ఇచ్చాడు . దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం.. సోషల్​ మీడియాలో ఈ ప్రకటన చేశాడు. దీనిపై భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. కోహ్లీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో ఘనతలు సాధించిందని పేర్కొన్నాడు.

“విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్​ఇండియా అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా రాణించింది. సారథిగా తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని గౌరవిస్తుంది. భవిష్యత్తులో ఓ ఆటగాడిగా కోహ్లీ.. జట్టు కోసం మరెన్నో ఘనతలు సాధించాలి. అతడో గొప్ప ప్లేయర్ అని గంగూలీ తెలిపాడు.

టీ20 ప్రపంచకప్​ అనంతరం కోహ్లీ టీమ్​ఇండియా టీ20 సారథిగా తప్పుకొన్నాడు. అనంతరం.. అతడిని వన్డే కెప్టెన్​గానూ తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు కూడా కోహ్లీ గుడ్​బై చెప్పడం అభిమానులకు నిరాశకు గురి చేసింది.

కోహ్లీ స్పందిస్తూ..”ఏడేళ్లు ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించా. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదు. ఏడేళ్ల నా కెప్టెన్సీలో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించా. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనికి నా కృతజ్ఞతలు” అని కోహ్లీ తన లేఖలో పేర్కొన్నాడు.

https://twitter.com/SGanguly99?