టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాలి?

What does it take to join Team India Semis?

0
78

టీ20 ప్రపంచకప్​ 2021లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్టు’..టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. ‘ఈసారి ట్రోఫీ మనదే!’ రెండు వార్మప్ మ్యాచ్​లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. ‘ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ఏం కాదు. భారత్ బలంగా పుంజుకోగలదు’.. తొలి మ్యాచ్​లో పాక్​పై ఓడిన తర్వాత వచ్చిన కామెంట్లివి..అయితే కొద్దిరోజుల సమయంలోనే అంతా మారిపోయింది.

రెండేళ్లుగా ఎంతో పట్టుదల, కసితో కనిపిస్తోన్న కోహ్లీసేన మెగాటోర్నీలో మాత్రం చేతులెత్తేస్తోంది. మొదటి మ్యాచ్​లో పాకిస్థాన్​ చేతిలో చిత్తయిన భారత్.. రెండో మ్యాచ్​లో న్యూజిలాండ్ పై ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో సెమీస్ చేరే అవకాశాన్ని దాదాపు చేజార్చుకుంది. అయితే సెమీస్ చేరాలంటే ఓ అవకాశం మాత్రం ఉంది. అదెలాగంటే..

టీమ్ఇండియా తొలి మ్యాచ్​లోనే పాక్ చేతిలో ఓడిపోయింది. కివీస్​తో మ్యాచ్​లో అయినా గెలిచి సెమీస్ రేసులో ఉంటుందనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. ఇక మన జట్టు అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాతో మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో బారత్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్​ల్లో విజయాలతో పాక్ సెమీస్ చేరినట్లే.

ఇక మనలాగే మూడు చిన్న జట్లతో మ్యాచ్​లు ఆడాల్సిన కివీస్..వాటిల్లో గెలిస్తే నాకౌట్​కు వెళుతుంది. అఫ్గాన్ ప్రమాదకరమైన జట్టు కాబట్టి..ఒకవేళ అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే అప్పుడు మనకు అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే న్యూజిలాండ్​ను అఫ్గానిస్థాన్ తక్కువ తేడాతో​ ఓడించాలి. అలాగే అఫ్గానిస్థాన్​పై భారత్ భారీ తేడాతో గెలవాలి. దీంతో మెరుగైన రన్​రేట్​ కారణంగా కోహ్లీసేన సెమీస్ చేరుతుంది.