ధోనీ ఇచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్న యువ ఆటగాళ్లు

-

మొన్న మ్యాచ్ ముగిసిన తర్వాత కుర్రాళ్లలో కసిలేదు అని కామెంట్ చేశాడు ధోనీ… ఇక మిస్టర్ కూల్ చేసిన కామెంట్ పై సీనియర్లు కూడా మండిపడ్డారు, అసలు కుర్రాళ్లకి అవకాశం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు, దీంతో ఈక్వేషన్ మారింది ధోనీ కొత్తగా ఆలోచించి సీనియర్లని పక్కన పెట్టి జూనియర్లకు కుర్రాళ్లకి అవకాశం ఇచ్చాడు.

- Advertisement -

ముంబైతో జరిగిన మ్యాచ్లో సీనియర్లను పక్కనబెట్టాడు ధోనీ. కేదార్ జాదవ్, పీయుష్ చావ్లాను తప్పించి.. యువ బ్యాట్స్మెన్ రుతురాజ్, జగదీశన్కు అవకాశమిచ్చాడు. వీరిద్దరూ కచ్చితంగా మంచి బ్యాటింగ్ చేస్తారు అని భావించారు కాని సీన్ మారింది..

కుర్రాళ్లకి రాకరాక అవకాశం వచ్చినా వీరు మిస్ చేసుకున్నారు, దీంతో ఇద్దరూ కూడా ముంబై బౌలర్ల దాటికి నిలవలేకపోయారు.. సీనియర్ బౌలర్లు బోల్ట్, బుమ్రా వేసిన బంతులకు విలవిల్లాడిపోయారు. బోల్ట్ వేసిన మొదటి ఓవర్లో రుతురాజ్ డకౌట్ అయితే..బుమ్రా వేసిన రెండో ఓవర్లో జగదీశన్ డకౌట్ అయ్యాడు.
కుర్రాళ్లకి ఛాన్స్ ఇచ్చినా వారు ఉపయోగించుకోలేదు అంటున్నారు సీఎస్కే ఫ్యాన్స్.. ఈ ఇన్నింగ్స్ లో రుతురాజ్, జగదీశన్ మాత్రమే కాదు.. డుప్లెసిస్, రాయుడు, ధోనీ, జడేజా కూడా దారుణంగా విఫలమయ్యారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...