వరద బాధితులకు ఎన్టీఆర్ విరాళం

వరద బాధితులకు ఎన్టీఆర్ విరాళం

0
46

కేరళ లో వరద బీభత్సం యావత్ భారత దేశాన్ని ఇప్పుడు కలిచివేస్తోంది. వరద ధాటికి ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులై.. తమను ఆదుకునే వారికోసం ఎదురుచూస్తున్నారు. చుట్టూ నీరు ఎటూ తోచని పరిస్థితి ఏ వైపు నుండి ఎలాంటి ముప్పు తన్నుకొస్తుందోననే భయం వీటన్నింటి మధ్య జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఎవరు ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. మేమున్నాం అంటూ ముందుకొచ్చి ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి చూసిన తెలుగు చిత్రసీమ వారిని ఆదుకోవడానికి నడుం బిగించింది.

ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కేరళ వరద బాధితుల కోసం ఆర్ధిక సహాయం ప్రకటించగా. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ముందుకొచ్చి 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తెలుగు సినీ ప్రముఖులు వరద బాధితుల కోసం ఇలా ముందుకురావటం ఐక్యతకు నిదర్శనం అంటున్నారు జనం.