నేడు ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు..ఎక్కడ జరగనుందో తెలుసా?

0
35

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 46 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 47 మ్యాచ్ లో తలపడానికి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ , నితీష్ రాణా, బాబా ఇంద్రజిత్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, డారిల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్