క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మ‌హిళ‌ల‌ ఐపీఎల్‌ పై కీలక నిర్ణయం

Good news for cricket fans..a key decision on women's IPL

0
45

క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభిస్తామ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలో ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభించాల‌నే డిమాండ్ వ‌స్తుంది.

ఈ నేపథ్యంలో నేడు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ.. ఈ రోజు ముంబైలో జ‌రిగిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ మ‌హిళా ఐపీఎల్ పై వ‌స్తున్న డిమాండ్స్ పై స్పందించారు.

వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలోనే ఆరు జ‌ట్లతో కూడిన ఉమెన్స్ ఐపీఎల్ ను నిర్వ‌హించాలని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌క‌టించారు.