రెండో టెస్టూ ఆసీస్​దే..ఇంగ్లండ్ కు మళ్లీ నిరాశే!

0
37

యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపు మీదున్న కంగారూ జట్టు.. రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్​ను ఓడించింది. 275 పరుగుల భారీ తేడాతో గెలిచి ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

రెండో ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. అయితే ఏ దశలోనూ ఇంగ్లండ్ లక్ష్యాన్ని సమీపించేలా కనిపించలేదు.

బట్లర్ (26, 207 బంతుల్లో), వోక్స్ (44) ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. దీంతో 192 పరుగులకు ఆలౌటై ఆసీస్​కు విజయాన్ని అప్పగించింది ఇంగ్లాండ్. ఆసీస్ బౌలర్లలో జే రిచర్డ్​సన్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఈ విజయం అనంతరం 5 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది.