సంచలనం..ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్‌..భారత్ స్కోర్ ఎంతంటే?

Sensation .. Kiwis spinner who took ten wickets in a single innings .. What is the score of India?

0
43

ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సంచలనం సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.

ఓవర్​నైట్​ స్కోరు 221/4తో రెండో రోజు ఆట ప్రారంభించింది టీమ్​ఇండియా. ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​(150) ధనాధన్​ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. అయితే ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే కివీస్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో సాహా(27), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0)లను పెవిలియన్‌ పంపాడు. అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించిన మయాంక్‌, అక్షర్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు.

అయితే రెండో సెషన్​లో మయాంక్​ అగర్వాల్​ను(150) అడ్డుకున్నాడు అజాజ్​​ పటేల్​. దీంతో 291 స్కోరు వద్ద ఏడో వికెట్​ను కోల్పోయింది టీమ్​ఇండియా. అక్షర్​తో(34) కలిసి మయాంక్​ 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా 100 ఓవర్లకు 291/7స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత హాఫ్​ సెంచరీ చేసిన అక్షర్ పటేల్​(52)​ కూడా అజాజ్​​​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత జయంత్​ యాదవ్​(12), ఉమేశ్​ కూడా తక్కువ స్కోర్​కే వెనుదిరిగారు. దీంతో 325 రన్స్​కు ఆలౌటైంది కోహ్లీసేన.