భారత్-దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ క్లారిటీ

BCCI Clarity on India-South Africa tour

0
34

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడ టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దీంతో ఇన్నాళ్లు టీమ్‌ఇండియా పర్యటనపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది. ప్రస్తుతానికి మూడు టెస్టులు, మూడు వన్డేలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని స్సష్టం చేసింది. టీ20 సిరీస్​ను మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే.. టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా బయలుదేరనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనున్నాయి. మొదటి టెస్టు డిసెంబరు 17న జొహానెస్‌ బర్గ్‌ వేదికగా ప్రారంభం కానుంది.