ప్రశాంత్ కిషోర్ సర్వే…వైసీపీ నేతలలో టెన్షన్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే...వైసీపీ నేతలలో టెన్షన్ ?

0
39

వై యస్ జగన్ తాజాగా ప్రశాంత్ కిశోర్ తో ఒక సర్వే చేయించారు. ఏ నాయకుడికి టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది.. ఇలా పలు అంశాల పై సర్వే సాగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల గుండెలలో భయం మొదలైంది. పీకే బృందం సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు తెలీకుండానే అనేక అంశాల పై సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా నాయకులకు ఇప్పటికే జగన్‌ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సర్వే నివేదిక ఇటీవలే ప్రతిపక్షనేత జగన్‌ చేతికి వెళ్లిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సర్వే జరిగిన విషయం నిజమేనని, ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని ఓ వైసీపీ నాయకుడు పేర్కొన్నారు. జగన్ పార్టీ టికెట్ కోసం చాలా మంది అశావాహులు లైన్ లో ఉన్నారని, అందుకే సర్వే చేసి మరీ టికెట్ ఇస్తున్నాం అంటూ ఓ సీనియర్ నాయకుడు వెల్లడించారు.

టికెట్‌ ఆశిస్తున్న నాయ కుల పనితీరుపై సూక్ష్మ పరిశీలన తర్వాతే.. గెలుస్తాడని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే టికెట్లు ఇస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. త్వరలోనే సర్వే నివేదిక ఆధారంగా ఆయా జిల్లా నాయకులతో భేటీ ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా ముఖ్య నాయకులకు సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది.