అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన బీజేపీ

అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన బీజేపీ

0
45

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యులు, అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు వేశారు. ఓటింగ్‌లో మొత్తం 451 మంది సభ్యులు పాల్గొన్నారు.